హిందువులు ఐక్యతను చాటాలి: ఎంపీ

ABN , First Publish Date - 2021-10-21T05:02:45+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో హిందువులు ఐక్యతను చాటాలని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. బుధవారం బోథ్‌లో నిర్వహించిన హనుమాన్‌ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

హిందువులు ఐక్యతను చాటాలి: ఎంపీ

బోథ్‌, అక్టోబరు 20: ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో హిందువులు ఐక్యతను చాటాలని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. బుధవారం బోథ్‌లో నిర్వహించిన హనుమాన్‌ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోథ్‌లో నిర్మించిన పంచముఖి హనుమాన్‌ మందిరానికి తన నిధుల నుంచి రూ.10లక్షలను అందిస్తామన్నారు. దుర్గా కమిటీ యువకుల విజ్ఞప్తి మేరకు మొదటి విడతలో రూ.5లక్షలను అందిస్తామన్నారు. యువకులు ఐక్యత భావాన్ని కనబరుస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టడం సంతోషించదగ్గ విషయమన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని అలవర్చుకోవాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ హిందూ సంప్రదాయాలను కొనసాగిస్తూనే ఇతర మతాల వారికి ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నారన్నారు. ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించారని అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేట్టి భావితరాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రాజుయాదవ్‌, దక్షిణమధ్య రైల్వే బోర్డు సభ్యుడు జీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T05:02:45+05:30 IST