ఎంపీసీ, బైపీసీ గ్రూపులు మంజూరు చేయండి
ABN , First Publish Date - 2021-05-20T06:41:15+05:30 IST
తెలంగాణ మైనార్టీ గురుకుల కళాశాలలో ఎంపీసీ, బైపీసీ కోర్సులు మంజూరు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి అల్లోలకు వినతి పత్రం సమర్పించారు.

నిర్మల్ అగ్రికల్చర్, మే 19 : తెలంగాణ మైనార్టీ గురుకుల కళాశాలలో ఎంపీసీ, బైపీసీ కోర్సులు మంజూరు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి అల్లోలకు వినతి పత్రం సమర్పించారు. నిర్మల్ పట్టణంలో గల మైనార్టీ గురుకుల కళాశాలలో ఎంఈసీ, సీఈసీ గ్రూపులు మాత్రమే ఉన్నం దున అందులో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని, కావునా వారు ఇతర ప్రాంతాల్లోకి వెళ్లి చదువు కోవాల్సిన పరిస్థితి నెలకొందని, విద్యార్థుల భవి ష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎంపీసీ, బైపీసీ గ్రూపులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.