పరిసరాల పరిశుభ్రత పాటించాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2021-06-19T06:38:48+05:30 IST
ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్నారు.
నిర్మల్ టౌన్, జూన్ 18 : ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. శుక్రవారం డ్రై డే సందర్భంగా నిర్మల్ పట్టణంలోని ఇందిరా నగర్ కాలనీలోని షాపులను పరిశీలించి వర్షాకాలం మొదలైనందున కూలర్లను వాడకూడదని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.