ఆందోళ్‌ మైసమ్మ ఆలయ అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2021-08-30T07:09:09+05:30 IST

ఆందోళ్‌ మైసమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ స్పీకర్‌ సిరుకొండ మధుసూదనాచారి అన్నారు.

ఆందోళ్‌ మైసమ్మ ఆలయ అభివృద్ధికి కృషి
అమ్మవారికి మొక్కుతున్న మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి

చౌటుప్పల్‌ రూరల్‌, ఆగస్టు 29: ఆందోళ్‌ మైసమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ స్పీకర్‌ సిరుకొండ మధుసూదనాచారి అన్నారు. చౌటుప్పల్‌ మండలంలోని ఆందోళ్‌ మైసమ్మ ఆలయాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఆయనకు దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సిద్దిపేట శేఖర్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో మధుసూదనాచారి పాల్గొన్నారు. తదనంతరం ఆయన మాట్లాడారు. మహిమ గల తల్లి ఆందోళ్‌ మైసమ్మ అని అన్నారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గిర్కాటి నిరంజన్‌గౌడ్‌, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



Updated Date - 2021-08-30T07:09:09+05:30 IST