యాదాద్రి ఆలయ గోపుర నిర్మాణానికి విరాళం
ABN , First Publish Date - 2021-10-28T05:50:39+05:30 IST
యాదాద్రి లక్ష్మినరసింహాస్వామి ఆలయ గోపుర నిర్మాణానికి నిధులు సేకరణకు సీఎం కేసీఆర్ పిలుపునివ్వడంతో మండలంలోని ముఖ్ర(కె) గ్రామస్థులు రూ.51వేల విరాళం సేకరించి పంపించారు.

ఇచ్చోడరూరల్, అక్టోబరు 27: యాదాద్రి లక్ష్మినరసింహాస్వామి ఆలయ గోపుర నిర్మాణానికి నిధులు సేకరణకు సీఎం కేసీఆర్ పిలుపునివ్వడంతో మండలంలోని ముఖ్ర(కె) గ్రామస్థులు రూ.51వేల విరాళం సేకరించి పంపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ సభ్యుడు సుభాష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.