నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2021-03-07T03:48:39+05:30 IST
శ్మశాన వాటిక నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం పొన్నారంలో నిర్మాణ పనులను పరిశీలించారు.
మందమర్రిరూరల్, మార్చి 6 : శ్మశాన వాటిక నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం పొన్నారంలో నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఇన్చార్జి సర్పంచు వాలా రవీందర్రావుకు సూచించారు. ప్రభు త్వం గ్రామాల అభివృద్ధి కోసం డంపింగ్యార్డులు, శ్మశాన వాటికలు నిర్మి స్తోందన్నారు. పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఎంపీవో షేక్ సప్దర్ ఆలీ, ఏపీవో రజియా సుల్తానా, కార్యదర్శి రజిత తదితరులు పాల్గొన్నారు.