సదరమ్ శిబిరాలు పారదర్శకంగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-01-21T03:55:17+05:30 IST
జిల్లాలో సదరమ్ శిబిరాలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు.
- ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్
ఆసిఫాబాద్, జనవరి 20: జిల్లాలో సదరమ్ శిబిరాలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య బోర్డు కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ సదరమ్ శిబిరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకు నేలా చూడాలని చెప్పారు. ఇందు కోసం ఎంపీడీవో, తహసీల్దార్, మీసేవ కేంద్రాల్లో సదరమ్ శిబిరాల దరఖాస్తుపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా గ్రామాభివృద్ధి అధికారి వెంకటశైలేష్, జిల్లా వైద్యాధికారి కుంరం బాలు, డీడబ్ల్యూవో సావిత్రి, డీఈవో పాణిని, మెడికల్ సూపరింటెండెంట్, మీసేవ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.