సత్రాన్ని పరిశీలించిన చీఫ్విప్ వినయ్ భాస్కర్
ABN , First Publish Date - 2021-12-31T03:54:42+05:30 IST
పట్టణంలో ఎమ్మెల్యే కోనేరుకోనప్ప చేపడుతున్న నిత్యాన్న దాన సత్రాన్ని గురువారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ వినయ్భాస్కర్ పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే కోనప్పతో నిత్యాన్నదానం చేస్తున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా అన్నం వండించారు.
![సత్రాన్ని పరిశీలించిన చీఫ్విప్ వినయ్ భాస్కర్](https://media.andhrajyothy.com/appimg/galleries/1921123010193495/12302021222431n57.jpg)
కాగజ్నగర్, డిసెంబరు 30: పట్టణంలో ఎమ్మెల్యే కోనేరుకోనప్ప చేపడుతున్న నిత్యాన్న దాన సత్రాన్ని గురువారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ వినయ్భాస్కర్ పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే కోనప్పతో నిత్యాన్నదానం చేస్తున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా అన్నం వడ్డిడించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లా డుతూ నిత్యం రెండువేల మందికి ఉచిత భోజనం పెడుతున్న సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సేవలు భేష్ అన్నారు. ఎమ్మెల్యే ఒక్కడే కాకుండా కుటుంబ సభ్యులంతా కూడా సమాజసేవ కోసం అంకితమైనట్టు వివరించారు. కోనేరు చారిట బుల్ ట్రస్టు వంశీ తదితరులున్నారు.