మహిళ మెడలోంచి గొలుసు అపహరణ
ABN , First Publish Date - 2021-10-25T06:13:01+05:30 IST
నసీరాబాద్ గ్రామంలో ఇంట్లో ఉన్న మహిళ మెడలోంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన సంఘటన ఆదివారం చో టుచేసుకుంది. ఎస్సై వెంకటరమణ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం ద్విచక్ర వాహనంపై వచ్చిన దొంగ మొదట రెండు ఇండ్లలో మ హిళలతో మాట్లాడి చివరగా ఒంటరిగా ఇంట్లో ఉన్న మళ్ళెల సత్తెవ్వ మహిళ మెడలోంచి రెండు తులాల బంగారు చైను అపహరించి పరారీ అయ్యా డు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, గ్రామీణ సీఐ వెంకటేష్, దిలవార్పూర్ ఎస్సై ప్రసాద్ అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

నర్సాపూర్(జి), అక్టోబరు 24: నసీరాబాద్ గ్రామంలో ఇంట్లో ఉన్న మహిళ మెడలోంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన సంఘటన ఆదివారం చో టుచేసుకుంది. ఎస్సై వెంకటరమణ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం ద్విచక్ర వాహనంపై వచ్చిన దొంగ మొదట రెండు ఇండ్లలో మ హిళలతో మాట్లాడి చివరగా ఒంటరిగా ఇంట్లో ఉన్న మళ్ళెల సత్తెవ్వ మహిళ మెడలోంచి రెండు తులాల బంగారు చైను అపహరించి పరారీ అయ్యా డు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, గ్రామీణ సీఐ వెంకటేష్, దిలవార్పూర్ ఎస్సై ప్రసాద్ అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.