కొత్త ఫీచర్లతో Audi Electric కారు..
ABN , First Publish Date - 2021-07-23T02:01:49+05:30 IST
కొత్త ఫీచర్లతో Audi Electric కారు..
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఆడి తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడల్లో కొత్త కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత మార్కెట్లో ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారును విడుదల చేసినట్లు ఆడి సంస్థ పేర్కొంది. ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు ప్రారంభ ధర రూ. 99.99 లక్షలు ఉంటుందని కంపెనీ తెలిపింది. టాప్-ఆఫ్-ది-లైన్ ఇ-ట్రోన్ స్పోర్ట్బ్యాక్ 55 వేరియంట్ కారు రూ. 1.18 కోట్ల వరకు ఉంటుంది.