పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు వినిపించిన చోట... మువ్వన్నెల జెండా రెపరెపలు!
ABN , First Publish Date - 2021-08-23T17:48:00+05:30 IST
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మొహర్రం సందర్భంగా...
ఉజ్జయిని: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మొహర్రం సందర్భంగా ఊరేగింపునకు అనుమతి లభించకపోవడంతో కొందరు యువకులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాల చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న యువకులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ఘటన జరిగిన ప్రాంతంలో తాజాగా ఒక యువకుడు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఉజ్జయినికి చెందిన అనిల్ థర్మ్... పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు వినిపించిన చోటు.... హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్’ అని పెద్దఎత్తున నినాదాలు చేస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. ఈ సమయంలో అక్కడకు చేరిన కొంతమంది కూడా హిందుస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది.