ఆ ఇంట్లో 6 గురు అమ్మాయిలు... అందరూ doctors అయ్యారు

ABN , First Publish Date - 2021-10-22T02:00:52+05:30 IST

ఒక కుటుంబంలో ఉన్న సభ్యులకు ఉన్నత చదువులో వేరువేరు లక్ష్యాలు ఉంటాయి. ఒకరు డాక్టర్ అవాలని, మరొకరు ఇంజినీరు అవాలని, ఇంకోకరు గ్రాడ్యుయేట్ అవ్వాలని కలకలు కంటారు. అనుకున్న వాటిని సాధించి ఆనందంలో మునిగితేలుతారు. కానీ ఇక్కడ రోటిన్ కథకు పూర్తి భిన్నంగా ఉంది.

ఆ ఇంట్లో 6 గురు అమ్మాయిలు... అందరూ doctors అయ్యారు

నందపురం, కోజికోడ్, కేరళ: ఒక కుటుంబంలో ఉన్న సభ్యులకు ఉన్నత చదువులో వేరువేరు లక్ష్యాలు ఉంటాయి. ఒకరు డాక్టర్ అవాలని, మరొకరు ఇంజినీరు అవాలని, ఇంకోకరు గ్రాడ్యుయేట్ అవ్వాలని కలకలు కంటారు. అనుకున్న వాటిని సాధించి ఆనందంలో మునిగితేలుతారు. కానీ ఇక్కడ రోటిన్ కథకు పూర్తి భిన్నంగా ఉంది. ఒకే కుటుంబంలో ఆరుగురు అమ్మాయిలు డాక్టర్లయ్యారంటే నమ్మస్యకంగా లేదు కదా.. ఇదీ నిజం.. ఆరుగురు కుమార్తెలు మరియు వారందరూ వైద్యులే.. కేరళలోని కోజికోడ్ నుంచి హృదయాన్ని కదిలింపజేసే కథ ఇదీ. కేరళ రాష్ట్రం కోజి‌కోడ్ జిల్లాలోని నాదాపురానికి చెందిన అహ్మద్ కున్హమ్మద్ కుట్టి మరియు అతని భార్య జైనా అహ్మద్ విషయంలో ఇది నిజం..


జైనా అహ్మద్ ఆరుగురు కుమార్తెలకు జన్మనిచ్చినప్పుడు, అహ్మద్ మరియు అతని భార్య నిరాశ చెందలేదు. హ్యాపీగా ఉన్నారు. అహ్మద్ తమ పిల్లల భవిష్యత్ గురించి, సమాజానికి తమ పిల్లలు సేవ చేయాలని ఆలోచించి, ఆ బాటలో నడిపించాడు. ఇతరుల కన్న తమ పిల్లలు ఆదర్శంగా ఉండేలా మహ్మద్ తమ పిల్లలను తీర్చిదిద్దారు. తమ ఆరుగురు కుమార్తెలు డాక్టర్లు అవడంతో అహ్మద్ సంతోషం వ్యక్తం చేశారు. నలుగురు కుమార్తెలు ఫాతిమా అహ్మద్ 39, హజ్ర అహ్మద్ 33, అయేషా అహ్మద్ 30 ఫైజా అహ్మద్ ప్రస్తుతం డాక్టర్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. చెన్నైలో రైహనా అహ్మద్ (23) ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నారు. మంగళూరులో అమీరా అహ్మద్ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.

Updated Date - 2021-10-22T02:00:52+05:30 IST