ల్యాప్టాప్ లేక తిప్పలు పడిన యువకుడు.. 504 కోట్లతో పెయింటింగ్ కొనేశాడు!
ABN , First Publish Date - 2021-03-29T11:33:30+05:30 IST
ఇటీవల జరిగిన ఒక వేలంపాటలో భారత మూలాలున్న విఘ్నేష్ సుందరేశన్, ఆనంద్ వెంకటేశ్వరన్ అనే ఇద్దరు యువకులు.. ఓ డిజిటిల్ కళాఖండాన్ని చూశారు.
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఒక వేలంపాటలో భారత మూలాలున్న విఘ్నేష్ సుందరేశన్, ఆనంద్ వెంకటేశ్వరన్ అనే ఇద్దరు యువకులు.. ఓ డిజిటిల్ కళాఖండాన్ని చూశారు. అది నచ్చి ఎలాగైనా కొనుగోలు చేయాలని భావించారు. అంతే వేలంపాటలో ఏకంగా 69.3 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు. అంటే మన లెక్కల్లో సుమారు 504 కోట్ల రూపాయలన్నమాట. ఇన్ని కోట్లతో ఒక పెయింటింగ్ కొనుగోలు చేసిన ఈ ఇద్దరూ.. కెరీర్ ప్రారంభంలో నానా అవస్థలూ పడ్డారట.
కోడింగ్ నేర్చుకోవడానికి ల్యాప్టాప్ కూడా కొనుగోలు చేయలేకపోయారట. ఫ్లాష్డ్రైవ్ ఒకటి పట్టుకొని తన మిత్రులు ఎవరైనా ల్యాప్టాప్ ఇస్తారా? అని సుందరేశన్ అడుగుతూ ఉండేవాడని వెంకటేశ్వరన్ వెల్లడించాడు. వీరి గురించి తెలిసిన వాళ్లు ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు..’ అనే మాట వీరిని చూస్తే నిజమనే అనిపిస్తోందని అంటున్నారు.