అర్ధరాత్రి బస్టాండ్లో కలకలం.. 23 ఏళ్ల భార్య కళ్ల ముందే 33 ఏళ్ల ఆ భర్త చేసిన పనికి నివ్వెరపోయిన ప్రయాణికులు
ABN , First Publish Date - 2021-09-02T23:19:26+05:30 IST
నగరంలోని ప్రధాన బస్టాండ్ అది. ప్రయాణికులతో రద్దీగా ఉంది. అందరూ బస్సెక్కేందుకు ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగా ఒక యువకుడు తన పీక కోసేసుకున్నాడు....
ఇంటర్నెట్ డెస్క్: నగరంలోని ప్రధాన బస్టాండ్ అది. ప్రయాణికులతో రద్దీగా ఉంది. అందరూ బస్సెక్కేందుకు ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగా ఒక యువకుడు తన పీక కోసేసుకున్నాడు. ఆ ఘటన చూసిన ప్రయాణికులు కంగుతిన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో వెలుగు చూసింది. భావ్సాహెబ్ తులసీరాం కాకడే(33) అనే వ్యక్తికి కొన్ని రోజుల క్రితం రాణీ కాకడే(23) పెళ్లయింది. పెళ్లయిన ఆరు నెలల వరకూ ఈ ఇద్దరి సంసారం సాఫీగానే సాగింది. కానీ ఏమైందో సడెన్గా వీరిద్దరి మధ్య చిన్న చిన్న విషయాల్లోనే గొడవలు అవడం ప్రారంభమైంది.
ఈ క్రమంలోనే వీళ్లిద్దరి మధ్య గొడవలు పెద్దవికాసాగాయి. కొన్నిరోజుల క్రితం వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఊరికి వెళ్లడం కోసం ఔరంగాబాద్లోని సెంట్రల్ బస్టాండ్కు వచ్చారు. అక్కడ కూడా వీళ్లిద్దరి మధ్య మరో గొడవ జరిగింది. అది తారస్థాయికి చేరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భావ్సాహెబ్.. ఒక పదునైన వస్తువు తీసుకొని తన గొంతు తనే కోసుకున్నాడు. ఈ దారుణాన్ని చూసిన చుట్టుపక్కలి వాల్లు నిర్ఘాంతపోయారు. వెంటనే అంబులెన్సును పిలిపించారు. అతన్ని స్థానికంగా ఉన్న ఘాటి హాస్పటల్లో చేర్పించారు. భావ్సాహెబ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.