భార్యపై విపరీతమైన ప్రేమను చూపిస్తూ.. అమాయకంగా కనిపిస్తున్న ఈ భర్త చేసిన నిర్వాకమేంటో తెలిస్తే..
ABN , First Publish Date - 2021-11-17T17:36:06+05:30 IST
వారిద్దరికీ ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది.. ఇటీవల భర్త ఉద్యోగం కోల్పోయాడు..
వారిద్దరికీ ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది.. ఇటీవల భర్త ఉద్యోగం కోల్పోయాడు.. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో సంసారంలో అశాంతి రేగింది.. ఉద్యోగం చేయడం లేదంటూ భర్తతో భార్య రోజూ గొడవ పెట్టుకునేది.. గత ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.. భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్త ఆమెను మూడో అంతస్థు నుంచి కిందికు తోసేశాడు.. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.. రాజస్థాన్లోని అజ్మీర్లో ఈ ఘటన జరిగింది.
అజ్మీర్లోని ఆరావళి విహారి అపార్ట్మెంట్లోని మూడో అంతస్థులో అవినాష్, సీమ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. కోవిడ్ సమయంలో అవినాష్ ఉద్యోగం కోల్పోయాడు. దీంతో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో సీమలో అసంతృప్తి మొదలైంది. ఉద్యోగం చేయడం లేదంటూ భర్తతో రోజూ గొడవ పెట్టుకునేది. గత ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో క్షణికావేశంలో సీమను అవినాష్ ఫ్లాట్ బాల్కనీ నుంచి కిందకు తోసేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
ప్రమాదవశాత్తూ సీమ కింద పడిపోయినట్టు అందరికీ చెప్పాడు. అయితే సీమ తల్లి మీనాక్షి మాత్రం ఆ సమాధానంతో సంతృప్తి చెందలేదు. అల్లుడే తన కూతురిని చంపేశాడని పోలీసులకు చెప్పింది. వారిద్దరి మధ్య ఎప్పట్నుంచో గొడవలు జరుగుతున్నాయని తెలిపింది. దీంతో అవినాష్ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో అవినాష్ నిజం అంగీకరించాడు. క్షణికావేశంలో సీమను ఫ్లాట్ బాల్కనీ నుంచి కిందకు తోసేనట్టు అంగీకరించాడు. దీంతో అవినాష్ను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.