తల్లి ఊరెళ్లడంతో బాయ్ఫ్రెండ్ను ఇంటికి పిలిపించుకుంది.. 2 రోజుల తరువాత గదిలో దృశ్యం చూసి ఇంటి ఓనర్కు భారీ షాక్!
ABN , First Publish Date - 2021-08-29T19:56:14+05:30 IST
తల్లి ఊరెళ్లడంతో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న యువతి..ఇంతలో ఊహించని పరిణామం
ఇంటర్నెట్ డెస్క్: రాఖీ పండగ సందర్భంగా తన తల్లి ఊరెళ్లడంతో ఓ యువతి ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. తల్లి నాలుగు రోజుల పాటు ఊరులోనే ఉంటానని చెప్పడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయం తమ ఇంటి ఓనర్కు తెలియకుండా ఉండేందుకు ఆమె ప్రియుడిని ఇంట్లోనే దాచిపెట్టింది. తాను ఆఫీసుకు వెళ్లే సమయంలో ఇంటికి తాళం పెట్టి వెళ్లిపోయేది. ఈ క్రమంలో ఓ రోజు ప్రియుడు అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరిపోసుకుని ప్రాణాలు వదిలాడు.
ఫ్యాన్కు వెళ్లాడుతున్న అతడి మృతదేహాన్ని గమనించిన ఇంటి ఓనర్ కుమారుడు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేశాడు. ఈ ఊహించని పరిణామానికి ఒక్కసారిగా షాకైపోయిన ఇంటి ఓనర్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఆజమ్గఢ్ జిల్లాలో ఆగస్టు 27న జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
కాగా.. ఇంటి ఓనర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆమె ప్రేమవ్యవహారం వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడితో ఏదో విషయమై యువతి ఘర్షణ పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘర్షణ తరువాతే అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలను వెలికితీసేందుకు పోలీసులు ప్రస్తుతం యువతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.