బీజేపీ సభతో వైసీపీ ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతోంది?
ABN , First Publish Date - 2021-12-30T01:08:54+05:30 IST
విజయవాడలో బీజేపీ నేతలు సభ నిర్వహించి ఏపీ సీఎం జగన్పై విరుచుకుపడిన విషయం తెలిసింది. అయితే ఈ సభలో...
అమరావతి: విజయవాడలో బీజేపీ నేతలు సభ నిర్వహించి ఏపీ సీఎం జగన్పై విరుచుకుపడిన విషయం తెలిసింది. అయితే ఈ సభలో బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేవకర్ చేసి వ్యాఖ్యలు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. బెయిల్పై ఉన్న కొందరు నేతలు త్వరలో జైలుకి వెళ్తారని ప్రకాశ్ జవదేకర్ ఎవరిని ఉద్దేశించారనే చర్చ కూడా సాగుతోంది. మరో వైపు బీజేపీ నేతలకు వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేసి మరీ వైసీపీ నేతలు విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో ‘‘బీజేపీ సభతో వైసీపీ ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతోంది?.బీజేపీ ఆరోపణలకు, వైసీపీ సమాధానాలకు లింకుందా?. సోము వీర్రాజు ప్రసంగం బీజేపీని ఇరకాటంలో పడేసిందా?. బీజేపీపై కేసీఆర్-కేటీఆర్పై షర్మిల సెటైర్లు పేలాయా?. విపక్షాలపై నోరు పారేసుకున్న సజ్జల -ఆనంకు సమాధానం చెప్తారా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.