ఆర్థిక అజ్ఞానం.. ఏపీలో ఎమర్జెన్సీ?

ABN , First Publish Date - 2021-12-16T01:12:17+05:30 IST

ఏపీలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక సంక్షోభంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభలో...

ఆర్థిక అజ్ఞానం.. ఏపీలో ఎమర్జెన్సీ?

న్యూఢిల్లీ/అమరావతి: ఏపీలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక సంక్షోభంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు. మంగళవారం రాజ్యసభలో బీజేపీ సభ్యుడొకరు అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. 2019-20లో రెవెన్యూ లోటు బడ్జెట్‌ అంచనాలకంటే పెరిగిందన్నారు. అమ్మఒడి, ఉచిత విద్యుత్‌ సరఫరా తదితర అనేక పథకాల వల్ల రెవెన్యూ లోటు అనూహ్యంగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయాలను వాస్తవికంగా అంచనా వేయడంలో వైఫల్యం చెందిందన్నారు.


రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ లోటు గ్రాంటుగా అందినప్పటికీ, రాష్ట్ర రెవెన్యూ లోటులో పెరుగుదల కొనసాగుతోందని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి నిధుల పంపిణీ తర్వాత 2020-21లో  రెవెన్యూ లోటు అంచనా రూ.5,897 కోట్లు ఉండగా, వాస్తవిక రెవెన్యూ లోటు రూ.34,926.80 కోట్లకు పెరిగిందని చెప్పారు. కాగ్‌ నివేదిక ఆధారంగా పన్నుల రూపంలో రాష్ర్టానికి రూ.29,935.32కోట్లు, గ్రాంట్‌గా రూ.57,930.62కోట్లు, రుణాల కింద రూ. 2 వేల కోట్లు విడుదల చేశామన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం పన్నుల రూపంలో రూ. 77,398కోట్లు రెవెన్యూ వస్తుందని అంచనా వేయగా, రూ.57,377.97కోట్లు మాత్రమే సమకూరిందని తెలిపారు. పన్నులేతర రెవెన్యూ రూ.5,267కోట్లు వస్తుందని అంచనా వేయగా రూ. 3,309.61 కోట్లే వచ్చిందన్నారు. 



ఈ నేపథ్యంలో ‘‘జగన్ ప్రభుత్వానికి క్రమ శిక్షణ లేదని కేంద్రం అనడానికి కారణాలేంటి?. రెవెన్యూ లోటు ప్రమాద హెచ్చరికలను దాటేసిందని చెప్పడానికి ఆధారాలేంటి?. రాష్ట్ర భవిష్యత్తు ఆందోళనకరంగా ఉందని ప్రభుత్వమే చెప్పాక జరగాల్సిందేమిటి.?. కష్టాల నుంచి బయటపడే మార్గం కనిపించడం లేదన్న జగన్ సర్కారు ఏం చేయాలనుకుంటోంది?. అసలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి-ఆర్థిక విధానానికి ఏ మాత్రమైన సంబంధం ఉందా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2021-12-16T01:12:17+05:30 IST