యూపీలో లాక్డౌన్ పొడిగింపు, ఇ-పాస్ తప్పనిసరి
ABN , First Publish Date - 2021-05-05T20:54:29+05:30 IST
కరోనా సెకెండ్ వేవ్లో రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ఉత్తరప్రదేశ్లోని నొయిడా..

లక్నో: కరోనా సెకెండ్ వేవ్లో రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ఉత్తరప్రదేశ్లోని నొయిడా సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో లాక్డౌన్ను ఈనెల 10వ తేదీ వరకూ పొడిగించారు. ఉత్తరప్రదేశ్ అదనపు చీఫ్ సెక్రటరీ నవ్నీత్ సెహగల్ బుధవారంనాడు ఈ మేరకు ప్రకటించారు. తాజా లాక్డౌన్తో మే 10వ తేదీ ఉదయం 7 గంటల వరకూ కరోనా కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. ఈ కాలంలో అన్ని దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసే ఉంటాయని చెప్పారు. దీనికి ముందు గురువారం ఉదయం 7 గంటల వరకూ లాక్డౌన్ను యూపీ ప్రభుత్వం పొడిగించింది. లాక్డౌన్ సమయంలో అత్యవసర సర్వీసుల కింద బయటకు వెళ్లాల్సి వస్తే ఇ-పాస్లు తప్పనిసరిగా పొందాలని పేర్కొంది. అధికారిక వెబ్సైట్ rahat.up.nic.in లో ఇ-పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లేవారికి మాత్రం ఇ-పాస్ అవసరం లేదు.