యూపీ బీజేపీ అధికార ప్రతినిధి కరోనాతో మృతి

ABN , First Publish Date - 2021-05-03T16:13:20+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి మనోజ్ మిశ్రా సోమవారం తెల్లవారుజామున కరోనాతో మరణించారు....

యూపీ బీజేపీ అధికార ప్రతినిధి కరోనాతో మృతి

లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి మనోజ్ మిశ్రా సోమవారం తెల్లవారుజామున కరోనాతో మరణించారు. బీజేపీ అధికార ప్రతినిధి మనోజ్ మిశ్రాకు కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో అతన్ని కాన్పూరులోని ఆసుపత్రిలో చేరారు. మనోజ్ మిశ్రా కొవిడ్ కు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. మనోజ్ మిశ్రా మృతి పట్ల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. మనోజ్ మిశ్రా కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని సీఎం తన సంతాపసందేశంలో పేర్కొన్నారు. యూపీలో బీజేపీ కీలక నేత కరోనా మరణించడంతో ఆ పార్టీ నేతలు విషాదంలో మునిగారు.

Updated Date - 2021-05-03T16:13:20+05:30 IST