Algeria: కార్చిచ్చులో 25 మంది సైనికుల మృతి
ABN , First Publish Date - 2021-08-11T13:15:57+05:30 IST
అల్జీరియా దేశంలోని అటవీ ప్రాంతంలో రాజుకున్న కార్చిచ్చు వల్ల 25 మంది సైనికులు, ఏడుగురు పౌరులు మరణించారు....
అల్జీర్స్: అల్జీరియా దేశంలోని అటవీ ప్రాంతంలో రాజుకున్న కార్చిచ్చు వల్ల 25 మంది సైనికులు, ఏడుగురు పౌరులు మరణించారు.అల్జీరియాలోని టిజి ఒజౌ, బెజాయియా ప్రావిన్సులో వాటిల్లిన అడవి మంటల్లో 32 మంది మరణించగా, పలువురు గాయపడ్డారని అల్జీరియా రక్షణ మంత్రి ప్రకటించారు. అగ్నిమాపకశాఖ అధికారులు, సైనికులు కలిసి 110 కుటుంబాలను మంటల బారి నుంచి రక్షించారు. కార్చిచ్చు వల్ల కొంగలు గ్రీస్ దాటి పోతున్నాయి. ఈ మంటల వల్ల కబీలీ ప్రాంతంలో పశువులు, కోళ్లు మరణించాయి. కార్చిచ్చు వెనుక ఎవరి హస్తం అయినా ఉండవచ్చని అల్జీరియా మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. అల్జీరియాలోని కబీలీ ప్రాంతంలోని జిటి ఓజౌ నగరంలో మంటల వల్ల ఓ ఇల్లు కాలిపోయింది. దట్టమైన అడవుల్లో రాజుకున్న మంటలను ఆర్పేందుకు బుల్డోజర్లను తీసుకువచ్చారు.