మధ్యలో పెళ్లి ఆపిన త్రిపుర డిస్ట్రిక్టు మెజిస్ట్రేట్‌పై సస్పెన్షన్ వేటు

ABN , First Publish Date - 2021-05-03T19:16:53+05:30 IST

కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని వివాహాన్ని ఆపివేసిన త్రిపుర వెస్ట్ డిస్ట్రిక్టు మెజిస్ట్రేట్ పై సర్కారు సస్పెన్షన్ వేటు...

మధ్యలో పెళ్లి ఆపిన త్రిపుర డిస్ట్రిక్టు మెజిస్ట్రేట్‌పై సస్పెన్షన్ వేటు

అగర్తలా (త్రిపుర): కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని వివాహాన్ని ఆపివేసిన త్రిపుర వెస్ట్ డిస్ట్రిక్టు మెజిస్ట్రేట్ పై సర్కారు సస్పెన్షన్ వేటు విధించింది. త్రిపుర వెస్ట్ డిస్ట్రిక్టు మెజిస్ట్రేట్ శైలేష్ కుమార్ యాదవ్ అగర్తలా నగరంలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని పెళ్లి తంతును నిలిపివేశారు. పెళ్లితంతు నిలిపివేసిన జిల్లా మెజిస్ట్రేట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పెళ్లిని ఆపిని జిల్లా మెజిస్ట్రేటుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు త్రిపుర ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. దీంతో మధ్యలో పెళ్లిని ఆపిన అధికారి యాదవ్ ను సస్పెండ్ చేస్తూ త్రిపుర సర్కారు ఆదేశాలు జారీ చేసింది. సీఎం దేబ్ ఆదేశాల మేరకు ఇద్దరు సీనియర్ అధికారులతో దర్యాప్తు జరిపి డీఎంపై వేటు వేశారు. పెళ్లితంతు సాగుతుండగా వధూవరులు, వారి కుటుంబసభ్యులు, అతిథులను వెంటనే బయలుదేరి వెళ్లి పోవాలని యాదవ్ వీడియోలో కోరారు.డీఎం కార్యాలయం వివాహానికి జారీ చేసిన అనుమతి పత్రాన్ని సమర్పించిననా దాన్ని యాదవ్ చించివేయడం వీడియోలో కనిపించింది. 


Updated Date - 2021-05-03T19:16:53+05:30 IST