14 వరకు ఊటీ రైలు రద్దు
ABN , First Publish Date - 2021-12-08T16:52:29+05:30 IST
నీలగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఊటీ రైలును రద్దు చేస్తున్నట్టు దక్షిణ రైల్వే ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం
![14 వరకు ఊటీ రైలు రద్దు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చెన్నై: నీలగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఊటీ రైలును రద్దు చేస్తున్నట్టు దక్షిణ రైల్వే ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం వుం డడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు కోయంబత్తూరు జిల్లా మేట్టుపాలయం నుంచి నీలగిరి జిల్లా ఊటీ వరకు వెళ్లే రైలు పూర్తిగా రద్దు చేశారు.