రాష్ట్రంలో 2,382 మందికి బ్లాక్ ఫంగస్
ABN , First Publish Date - 2021-06-20T15:01:22+05:30 IST
రాష్ట్రంలో ఇప్పటివరకు 2,382 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడినట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. నగరంలో శనివారం మీడియాతో మాట్లాడిన మం
పెరంబూర్(చెన్నై): రాష్ట్రంలో ఇప్పటివరకు 2,382 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడినట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. నగరంలో శనివారం మీడియాతో మాట్లాడిన మంత్రి, రాష్ట్రప్రజలు కరోనా టీకా వేసుకోవడంపై ఆసక్తి చూపుతున్న కారణంగా, టీకా తప్పనిసరి అని ప్రకటిం చాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో 2,382 మంది బ్లాక్ ఫంగస్కు గురికాగా, 111 మంది చికిత్సల అనంతరం డిశ్చార్జి అయ్యారని తెలిపారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు ముఖ్యమంత్రి బీమా పథకం ద్వారా చికిత్సలు అందించే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. చెన్నై కార్పొరేషన్ పరిధిలో దివ్యాంగుల ఇళ్లకే వెళ్లి కరోనా టీకాలు వేసే పనులు ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు.