క్రిమినల్ కేసులపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టనున్న సుప్రీం
ABN , First Publish Date - 2021-11-24T16:19:11+05:30 IST
ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసుల సత్వర విచారణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.
న్యూఢిల్లీ: ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసుల సత్వర విచారణపై దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల అమలులో లోపాలు కనిపిస్తున్నాయని, విచారణ వేగవంతం కాకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని సుప్రీంకోర్టులో పలువురు న్యాయవాదులు ఐఎలు దాఖలు చేశారు. ఏడాదిలోగా కేసుల విచారణ పూర్తి చేయాలని గతంలో ధర్మాసనం ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని గత వారం విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించారు.
ఈ వ్యవహారంపై ఇవాళ మరోసారి విచారణ జరపనున్నారు.