తమిళనాట ‘నీట్‌’కు మరో విద్యార్థి బలి

ABN , First Publish Date - 2021-10-31T08:08:36+05:30 IST

మరికొద్దిరోజుల్లో నీట్‌ పరీక్ష ఫలితాలు రానుండగా.. ఉత్తీర్ణతపై భయంతో తమిళనాట మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోయంబత్తూర్‌ జిల్లా పుదూర్‌కుప్పంకు

తమిళనాట ‘నీట్‌’కు మరో విద్యార్థి బలి

చెన్నై, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): మరికొద్దిరోజుల్లో నీట్‌ పరీక్ష ఫలితాలు రానుండగా.. ఉత్తీర్ణతపై భయంతో తమిళనాట మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోయంబత్తూర్‌ జిల్లా పుదూర్‌కుప్పంకు చెందిన కుప్పుస్వామి-వలర్మతి దంపతుల కుమారుడు కీర్తివాసన్‌ (20) ప్లస్‌ టూ ముగించి రెండుసార్లు నీట్‌ రాశాడు. అయినా ఫలితం లేకపోవడంతో గత సెప్టెంబరులో జరిగిన నీట్‌కు కూడా హాజరయ్యాడు. అప్పటి నుంచి ముభావంగా ఉంటున్న కీర్తివాసన్‌.. మరికొద్ది రోజుల్లో పరీక్ష ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషం తాగాడు. ఆతర్వాత తల్లికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. తల్లి ఇంటికి చేరుకుని చూసేసరికి నోటి నుంచి నురగలు కక్కుతూ కీర్తివాసన్‌ కనిపించాడు. దీంతో అతడిని తొలుత పొల్లాచ్చి ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి కోయంబత్తూరు తీసుకెళ్తుండగా మధ్యలోనే చనిపోయాడు.

Updated Date - 2021-10-31T08:08:36+05:30 IST