రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం

ABN , First Publish Date - 2021-05-21T09:09:18+05:30 IST

తూర్పు తీరం లో బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఒడిసా, పశ్చిమ బెంగాల్‌కు తుఫాన్‌ ముప్పు పొంచి ఉంది.

రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం

48 గంటల్లో ఏపీకి వర్షసూచన 



అమరావతి/విశాఖపట్నం/న్యూఢిల్లీ, మే 20 (ఆంధ్రజ్యోతి): తూర్పు తీరంలో బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఒడిసా, పశ్చిమ బెంగాల్‌కు తుఫాన్‌ ముప్పు పొంచి ఉంది.  22న ఉత్తర అండమాన్‌ సముద్రం, దానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. 24నాటికి తుఫాన్‌గా మారే అవకాశముంది. 27న తుఫాన్‌ తీరం దాటే అవకాశముంది. కాగా నైరుతి రుతుపవనాల ఆగమనానికి వాతావరణం అనుకూలంగా మారింది. శుక్రవారం దక్షిణ అండమాన్‌ పరిసరాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముంది. కోస్తాంధ్రలో శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 

Updated Date - 2021-05-21T09:09:18+05:30 IST