సీరమ్ టీకాలను రాష్ట్రాలు స్వేచ్ఛగా కొనుక్కోవచ్చు: కేంద్రం
ABN , First Publish Date - 2021-04-23T08:20:08+05:30 IST
వచ్చే నెల 25 దాకా తాను ఉత్పత్తి చేసిన టీకాలన్నీ కేంద్రానికే సరఫరా చేసేటట్టుగా సీరమ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందంటూ వచ్చిన వార్తలను కేంద్ర ఆరోగ్య శాఖ కొట్టిపారేసింది...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: వచ్చే నెల 25 దాకా తాను ఉత్పత్తి చేసిన టీకాలన్నీ కేంద్రానికే సరఫరా చేసేటట్టుగా సీరమ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందంటూ వచ్చిన వార్తలను కేంద్ర ఆరోగ్య శాఖ కొట్టిపారేసింది. అవన్నీ అవాస్తవాలతో కూడిన కథనాలని తోసిపుచ్చింది. కొత్త విధానం ప్రకారం రాష్ట్రప్రభుత్వాలు సీరమ్ సంస్థ నుంచి స్వేచ్ఛగా టీకాలు కొనుక్కోవచ్చని స్పష్టం చేసింది. టీకా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసే క్రమం లో భాగంగా.. ఏప్రిల్ 19న ‘లిబరలైజ్డ్ ప్రైసింగ్ అండ్ యాక్సిలరేటెడ్ నేషనల్ కొవిడ్-19 స్ట్రాటజీ’ పేరిట కొత్త వ్యూహాన్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసింది. అది మే 1 నుంచి అమల్లోకి రానుంది. కొత్త విధానంలో 50 శాతం టీకాలను రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆస్పత్రులకు అమ్ముకోవచ్చు.