పులుల శరణాలయాలుగా శ్రీవిల్లిపుత్తూర్, మేఘమలై
ABN , First Publish Date - 2021-02-08T12:47:45+05:30 IST
శ్రీవిల్లిపుత్తూర్, మేఘమలై అటవీ ప్రాంతాలను పులుల శరణాలయాలుగా మార్చేందుకు కేంద్రప్రభుత్వం అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటికే కళక్కాడు ముండతురై
![పులుల శరణాలయాలుగా శ్రీవిల్లిపుత్తూర్, మేఘమలై](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చెన్నై/ఐసిఎఫ్(ఆంధ్రజ్యోతి): శ్రీవిల్లిపుత్తూర్, మేఘమలై అటవీ ప్రాంతాలను పులుల శరణాలయాలుగా మార్చేందుకు కేంద్రప్రభుత్వం అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటికే కళక్కాడు ముండతురై, ఆనమలై, ముదుమలై, సత్య మంగళం పులుల శరణాలయాలున్నాయి. ఈ నేపథ్యంలో, శ్రీవిల్లిపుత్తూర్, మేఘమలై అటవీ ప్రాంతాలను కూడా పులుల శరణాలయాలుగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ మూడు ఆడ పులులతో పాటు 14 పులులు నివసిస్తున్నాయి. వీటి పాదముద్రల ఆధారంగా పులుల శరణాలయాలుగా మార్చాలని కేంద్రప్రభుత్వానికి గత జనవరిలో రాష్ట్రప్రభుత్వం లేఖ రాసింది.