ఆరుగురు జైషే ఉగ్రవాదుల హతం
ABN , First Publish Date - 2021-12-31T08:55:26+05:30 IST
జమ్మూకశ్మీర్లో జరిగిన జంట ఎన్కౌంటర్లలో ఆరుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులు హత మయ్యారు.

శ్రీనగర్, డిసెంబరు 30: జమ్మూకశ్మీర్లో జరిగిన జంట ఎన్కౌంటర్లలో ఆరుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులు హత మయ్యారు. అర్ధరాత్రి అనంతనాగ్ జిల్లాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో మరో ముగ్గురు జైషే ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ ఘటనల్లో ఒక జవాను మృతి చెందగా.. మరో జవాను, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.