జమ్ము కశ్మీర్‌లో ఎదురుకాల్పులు..నలుగురు ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2021-03-22T16:28:49+05:30 IST

షోపియాన్‌లో జిల్లాలో భద్రతా దళాలు-ఉగ్రవాదులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‎కౌంటర్ నలుగురు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి...

జమ్ము కశ్మీర్‌లో ఎదురుకాల్పులు..నలుగురు ఉగ్రవాదుల హతం

జమ్ముకశ్మీర్‌: షోపియాన్‌లో జిల్లాలో భద్రతా దళాలు-ఉగ్రవాదులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‎కౌంటర్‎లో నలుగురు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.  మునిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారమందడంతో.. భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ఆ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా..భారత భద్రతా దళాలపై ముష్కర్లు కాల్పులకు  తెగబడ్డారు. దీంతో భారత జవాన్లు వారికి ధీటుగా సమాధానం ఇచ్చారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు. మృతి చెందిన నలుగురు ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందిన వారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.

Updated Date - 2021-03-22T16:28:49+05:30 IST