7న ఒకే వేదికపై 234 మంది అభ్యర్థుల పరిచయం
ABN , First Publish Date - 2021-03-03T13:07:27+05:30 IST
ఏదో ఒక రూపంలో జనం నోళ్లలో నానాలను కునే రాజకీయనేతలకు కొదవేం లేదు. ఇప్పుడు ‘నామ్ తమిళర్ కట్చి’ అధినేత సీమాన్ కూడా...
చెన్నై/ప్యారీస్ (ఆంధ్రజ్యోతి): ఏదో ఒక రూపంలో జనం నోళ్లలో నానాలను కునే రాజకీయనేతలకు కొదవేం లేదు. ఇప్పుడు ‘నామ్ తమిళర్ కట్చి’ అధినేత సీమాన్ కూడా అదే బాటలో పయనిస్తున్నట్టున్నారు. విజయసంగతెలాగున్నా తమ అభ్యర్థులందరికీ ఒకే చోట చేర్చి రికార్డు సృష్టించాలనుకుంటున్నారట. ఇందులో భాగంగా స్థానిక రాయపేటలోని వైఎంసీఏ మైదానంలో ఈనెల 7వ తేదీన తమ పార్టీ అభ్యర్థుందరినీ పరిచయం చేయాలని నిర్ణయించారు. ఒంటరిగా బరిలోకి దిగుతున్న సీమాన్ పార్టీకి చెందిన 234 మంది అభ్యర్థులు ఒకే వేదికపై కనిపించబోతున్నారట. ‘ఓట్లు ఎలాగూ అంతగా పడవు.. అభ్యర్థులనైనా కొంతమందిని కనిపించేలా చేయాలని ఆయన తపన’ అంటూ ఓ ప్రత్యర్థి పార్టీ నేత సెటైర్లు విసురుతున్నాడు. మొత్తం 234 మంది అభ్యర్థుల్లో సగం మంది పురుషులు, సగం మంది మహిళా అభ్యర్థులు వుంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.