విడుదలైన ‘చిన్నమ్మ’.. ఫిబ్రవరిలో చెన్నైకి..
ABN , First Publish Date - 2021-01-27T17:54:39+05:30 IST
అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. పరప్పణ అగ్రహారం జైలులో ఆమె తన నాలుగేళ్ల జైలుశిక్ష ముగించుకున్నారు.
బెంగళూరు: అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. పరప్పణ అగ్రహారం జైలులో ఆమె తన నాలుగేళ్ల జైలుశిక్ష ముగించుకున్నారు. ఈ మేరకు విడుదలకు సంబంధించిన అధికారిక పత్రాలను జైలు అధికారులు అందజేశారు. అవినీతి కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవించిన శశికళ.. కరోనాతో ప్రస్తుతం బెంగూళరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొన్ని రోజులపాటు ఆస్పత్రిలోనే శశికళ ఉండనున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో చెన్నైకి శశికళ రానున్నారు.