ఎమర్జెన్సీ కాలం చెల్లిన వ్యవహారం : శివసేన
ABN , First Publish Date - 2021-03-07T23:45:52+05:30 IST
ఎమర్జెన్సీ అనేది కాలం చెల్లిన వ్యవహారమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే ఎమర్జెన్సీ రోజులే
ముంబై : ఎమర్జెన్సీ అనేది కాలం చెల్లిన వ్యవహారమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే ఎమర్జెన్సీ రోజులే బాగుండేవని కొందరి భావనగా ఉందని అన్నారు. ‘‘ఎమర్జెన్సీ విధించిన కారణంగా ఇందిరకు తగిన విధంగా ప్రజలు బుద్ధి చెప్పారు. ఆమెకు ఓ గుణపాఠం నేర్పారు. కానీ... ఆ తర్వాత ఆమెకు అధికారాన్ని అప్పజెప్పి ప్రజలు క్షమించారు. మళ్లీ ఈ వ్యవహారాన్ని ఎందుకు తవ్వి తీస్తున్నారు. శాశ్వతంగా ముగిసిపోయింది. కాలం చెల్లిన అంశం.’’ అంటూ సామ్నా వేదికగా రౌత్ వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ విధించడం తప్పేనన్న రాహుల్ వ్యాఖ్యలపై కూడా రౌత్ స్పందించారు. రాహుల్ గాంధీ చాలా ముక్కుసూటి మనిషని, సామాన్యుడని, రౌత్ తెలిపారు.