ఎమర్జెన్సీ కాలం చెల్లిన వ్యవహారం : శివసేన

ABN , First Publish Date - 2021-03-07T23:45:52+05:30 IST

ఎమర్జెన్సీ అనేది కాలం చెల్లిన వ్యవహారమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే ఎమర్జెన్సీ రోజులే

ఎమర్జెన్సీ కాలం చెల్లిన వ్యవహారం : శివసేన

ముంబై : ఎమర్జెన్సీ అనేది కాలం చెల్లిన వ్యవహారమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే ఎమర్జెన్సీ రోజులే బాగుండేవని కొందరి భావనగా ఉందని అన్నారు. ‘‘ఎమర్జెన్సీ విధించిన కారణంగా ఇందిరకు తగిన విధంగా ప్రజలు బుద్ధి చెప్పారు. ఆమెకు ఓ గుణపాఠం నేర్పారు. కానీ... ఆ తర్వాత ఆమెకు అధికారాన్ని అప్పజెప్పి ప్రజలు క్షమించారు. మళ్లీ ఈ వ్యవహారాన్ని ఎందుకు తవ్వి తీస్తున్నారు. శాశ్వతంగా ముగిసిపోయింది. కాలం చెల్లిన అంశం.’’ అంటూ సామ్నా వేదికగా రౌత్ వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ విధించడం తప్పేనన్న రాహుల్ వ్యాఖ్యలపై కూడా రౌత్ స్పందించారు. రాహుల్ గాంధీ చాలా ముక్కుసూటి మనిషని, సామాన్యుడని, రౌత్ తెలిపారు. 

Updated Date - 2021-03-07T23:45:52+05:30 IST