ఆధార్తో రూ.2.25 లక్షల కోట్ల ఆదా!
ABN , First Publish Date - 2021-12-17T06:39:10+05:30 IST
ఆధార్ కారణంగా ప్రభుత్వ పథకాల అమలులో భారీగా సొమ్ములు
న్యూఢిల్లీ, డిసెంబరు 16: ఆధార్ కారణంగా ప్రభుత్వ పథకాల అమలులో భారీగా సొమ్ములు ఆదా అయ్యాయి! పథకాలకు ఆధార్ను అనుసంధానించడం ద్వారా బోగస్ లబ్ధిదారులకు అడ్డుకట్ట వేయగలిగినట్లు యూఐడీఏఐ సీఈవో సౌరభ్ గార్గ్ తెలిపారు. 300 కేంద్ర పథకాలు, 400 రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ఆధార్తో అనుసంధానం చేసి.. నిజమైన లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేయడం వల్ల రూ.2.25 లక్షల కోట్లు ఆదా అయినట్లు చెప్పారు.