కాటన్ జూదం: 21 మంది అరెస్టు
ABN , First Publish Date - 2021-01-25T12:02:21+05:30 IST
రాణిపేట డీఎస్పీ పూరణి నేతృత్వంలో 85 మంది పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కాటన్జూదం
చెన్నై/వేలూరు (ఆంధ్రజ్యోతి): రాణిపేట డీఎస్పీ పూరణి నేతృత్వంలో 85 మంది పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కాటన్జూదం ఆడుతున్న 21 మందిని అరెస్టు చేశారు. రాణిపేట, సిప్కాట్, ఆర్కాడు, తిమిరి, అర క్కోణం, షోలింగర్, తక్కోలమ్, నెమిలి ప్రాంతాల్లో వీరిని అరెస్టు చేసి వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. కాటన్ జాదం ఆడే వారిని గూండా చట్టం కింద అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ మయిల్వాహనం హెచ్చరించారు.