ఐసీయూలో రజనీకాంత్‌?

ABN , First Publish Date - 2021-10-29T08:15:31+05:30 IST

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ గురువారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలియగానే ఆయన అభిమానుల్లో

ఐసీయూలో రజనీకాంత్‌?

  • చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిక
  • సీరియస్‌ అంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ 
  • సాధారణ పరీక్షల కోసమేనని భార్య వెల్లడి


చెన్నై, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ గురువారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలియగానే ఆయన అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మూడు రోజుల క్రితం ఢిల్లీలో దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం అందుకున్న ఆయన అంతలోనే ఆస్పత్రిలో చేరడంతో అభిమానుల్లో ఆందోళన చెందారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో.. ఆయన అనారోగ్యానికి గురయ్యారని, తీవ్ర అస్వస్థత చెందారంటూ వదంతులు వ్యాపించాయి. దీనిపై రజనీ సతీమణి లత మాట్లాడుతూ.. ఏటా నిర్వహించే సాధారణ పరీక్షల్లో భాగంగానే ఆయన కావేరీ ఆస్పత్రికి వెళ్లారని, అంతకుమించి ఏమీ లేదని స్పష్టం చేశారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాగా దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్న తర్వాత మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి రజనీ చెన్నై చేరుకున్నారు. గురువారం ఉదయం నుంచి కాస్త నలతగా ఉన్నారు.


రాత్రి 7.30 గంటల సమయంలో తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను కావేరీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఎంఆర్‌ఐ స్కాన్‌ తీయగా, రక్తనాళం పగిలినట్లు గుర్తించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో వైద్యులు ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. రజనీ క్షేమంగా ఉన్నారని, ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి అయ్యే అవకాశముందని ఆస్పత్రి వర్గాలు వివరించాయి. 

Updated Date - 2021-10-29T08:15:31+05:30 IST