పంజాబ్ హరియాణ హైకోర్టులో 10 మంది జడ్జిలకు పదోన్నతి
ABN , First Publish Date - 2021-10-25T06:56:34+05:30 IST
పంజాబ్ హరియాణ హైకోర్టులో 10 మంది అదనపు న్యాయమూర్తులకు శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది.

న్యూఢిల్లీ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): పంజాబ్ హరియాణ హైకోర్టులో 10 మంది అదనపు న్యాయమూర్తులకు శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. పదోన్నతి కల్పించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.