కిడ్నీల కోసం ఎదురు చూస్తున్న పూణె
ABN , First Publish Date - 2021-07-30T07:06:06+05:30 IST
అవయవ దాతల కోసం పుణె నగరం ఎదురు చూస్తోందని అక్కడి వైద్యులు చెబుతున్నారు. నగరంలో చేపట్టిన ఆర్గాన్ డొనేషన్ డ్రైవ్ను..
పుణె: అవయవదాతల కోసం పుణె నగరం ఎదురు చూస్తోందని అక్కడి వైద్యులు చెబుతున్నారు. నగరంలో చేపట్టిన ఆర్గాన్ డొనేషన్ డ్రైవ్ను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. కోవిడ్ ముందు పరిస్థితులకు చేరుకోవాలంటే అదొక్కటే మార్గమని చెబుతున్నారు. ఈ మేరకు నగరంలోని ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఎస్ఎం అంబికే పేర్కొన్నారు. డాక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటికే నగరంలో దాదాపు 1600 మంది కిడ్నీ దాతల కోసం ఎదురు చూస్తున్నారు. 75 మంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, 50 మందికి హృదయ మార్పిడి చేయాల్సి ఉంది. ఇక మరో 70 మందికి వివిధ రకాల అవయవాలను మార్పిడి చేయాల్సి ఉంది.
అయితే నగరంలో 2020 నాటికి కేవలం 41 మంది మాత్రమే అవయవదాతలు ఉన్నారని, ఆ సంఖ్య గతనెల నాటికి 13కు పడిపోయిందని, వెంటనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అవయవదానంపై అవగాహన కల్పించి కొత్త వారిని ఇందులో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే నగరం భవిష్యత్తులో ఇలాంటి సమస్యను ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తవని అన్నారు.