బైపాస్ తర్వాత రాష్ట్రపతి భవన్కు చేరుకున్న రాష్ట్రపతి కోవింద్
ABN , First Publish Date - 2021-04-13T01:08:57+05:30 IST
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ బైపాస్ సర్జరీ చేయించుకొని తిరిగి రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. ఈ మేరకు కోవింద్
న్యూఢిల్లీ : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ బైపాస్ సర్జరీ చేయించుకొని తిరిగి రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. ఈ మేరకు కోవింద్ సోమవారం ట్వీట్ చేశారు. ‘‘శస్త్రచికిత్స తర్వాత ఆరోగ్యంగా రాష్ట్రపతి భవన్కు తిరిగి వచ్చేశాను. మీ అందరి ప్రార్థనలతో తిరిగి ఆరోగ్యవంతుడిని అయ్యాను. ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది క్షేమంగా చూసుకోవడం వల్లే వేగంగా కోలుకున్నాను. అందరికీ కృతజ్ఞతలు. ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉంది.’’ అని కోవింద్ ట్వీట్ చేశారు.