మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలి.. మోదీ ట్వీట్
ABN , First Publish Date - 2021-10-14T16:48:35+05:30 IST
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు.
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. మన్మోహన్ సింగ్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆయనకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. జ్వరం, నీరసంతోనూ ఆయన బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. 88 సంవత్సరాల మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఆరంభంలో కోవిడ్-19తో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు.