మూడోరోజూ నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు

ABN , First Publish Date - 2021-02-26T15:44:54+05:30 IST

ఈ-వే బిల్లు, ఇంధనం ధరలకు వ్యతిరేకంగా భారత్ బంద్ ఓవైపు జరుగుతుండగా, శుక్రవారం వరుసగా మూడు రోజు కూడా ..

మూడోరోజూ నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ: ఈ-వే బిల్లు, ఇంధనం ధరలకు వ్యతిరేకంగా భారత్ బంద్ ఓవైపు జరుగుతుండగా, శుక్రవారం వరుసగా మూడు రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. ధరలు పెరగలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా రోజువారీ ధరల పెరుగుదల  దేశవాళీ మార్కెట్‌లో ఉబ్బడిముబ్బడి కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.83 కాగా, డీజిల్ రూ.81.32కు చేరింది. అంతర్జాతీయంగా ఆయిల్ ఉత్పత్తి గణనీయంగా తగ్గడం, కోవిడ్ ప్రభావం ఉత్పత్తిపై పడటం ధరల పెరుగదలకు కారణమని పెట్రోలియం మంత్రిత్వ శాఖ చెబుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఒపెక్ ప్లస్ దేశాలు వచ్చేవారంలో సమావేశం కానున్నాయి. చమురు ఉత్పత్తిని పెంచే అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నాయి.

Updated Date - 2021-02-26T15:44:54+05:30 IST