సామాన్యులపై పడని పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం
ABN , First Publish Date - 2021-02-01T19:02:59+05:30 IST
పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయి. లీటర్ పెట్రోల్పై రూ.2.50, లీటర్ డిజిల్ పై రూ. 4 సెస్ విధించనున్నారు. అయితే ఈ

న్యూఢిల్లీ : బడ్జెట్ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం సామాన్యులపై పడలేదు. కస్టమ్స్ డ్యూటీ తగ్గించి, ఆ మేరకు సెస్ పెంచుతున్నట్లు కేంద్రం తెలిపింది. లీటర్ పెట్రోల్పై రూ.2.50, లీటర్ డిజిల్ పై రూ. 4 సెస్ విధించనున్నారు. అందువల్ల పెట్రో ధరల మార్పు ప్రభావం సామాన్యులపై ఉండదు. అయితే ఈ విషయాన్ని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. డీజిల్పై అగ్రి ఇన్ఫ్రా సెస్ను కేంద్రం విధించనుంది.