రాజస్థాన్లో డీజిల్ సెంచరీ
ABN , First Publish Date - 2021-06-13T08:51:46+05:30 IST
పెట్రోల్ ధరనే కాదు.. డీజిల్ ధర కూడా సెంచరీ కొట్టేసింది. రాజస్థాన్లో లీటరు డీజిల్ ధర రూ.100 మార్కును దాటింది. ప్రభుత్వరంగ చమురు విక్రయ కంపెనీలు శ నివారం లీటరు పెట్రోల్ ధరను 27పైసలు,
మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
పెట్రోల్పై 27, డీజిల్పై 23 పైసలు పెంపు
న్యూఢిల్లీ, జూన్ 12: పెట్రోల్ ధరనే కాదు.. డీజిల్ ధర కూడా సెంచరీ కొట్టేసింది. రాజస్థాన్లో లీటరు డీజిల్ ధర రూ.100 మార్కును దాటింది. ప్రభుత్వరంగ చమురు విక్రయ కంపెనీలు శ నివారం లీటరు పెట్రోల్ ధరను 27పైసలు, డీజిల్ ధరను 23 పైసలు పెంచాయి. తాజాగా లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటిన ఏడో రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లద్దాఖ్లో పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.99.90, డీజిల్ రూ.94.82కి చేరుకుంది. ఇక మే 4 తర్వాత 23సార్లు ధరలను పెంచడంతో లీటరు పెట్రోల్ రూ.5.72, డీజిల్ రూ.6.25 పెరిగింది.