ప్రైవసీపై పెను దాడి, సుప్రీంకోర్టు జడ్జికి విచారణ అప్పగించాలి: కమల్నాథ్
ABN , First Publish Date - 2021-07-21T23:29:28+05:30 IST
ఇజ్రాయిల్ స్పైవేర్ పెగాసస్ నిఘా వివాదాన్ని ప్రజల ''ప్రైవసీపై పెను దాడి''గా మధ్యప్రదేశ్...
న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ స్పైవేర్ పెగాసస్ నిఘా వివాదాన్ని ప్రజల ''ప్రైవసీపై పెను దాడి''గా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ అభివర్ణించారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. బుధవారంనాడు మీడియాతో ఆయన మాట్లాడుతూ, పెగాసస్ గూఢచర్యంపై ఇప్పటికే ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిందని చెప్పారు. ఇజ్రాల్కు ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీ నుచి లైసెన్సు, స్పైవేర్ పొందలేదని సుప్రీంకోర్టు ముందు కేంద్రం తప్పనిసరిగా అఫిడవిడ్ దాఖలు చేయాలన్నారు. ''జాతీయ భద్రత కోసం స్పైవేర్ను కొనుగోలు చేయారా? మోదీ భద్రత కోసం కొనుగోలు చేశారా?'' అనే దానిపై కేంద్రం వివరణ ఇవ్వాలని కమల్నాథ్ డిమాండ్ చేశారు. కాగా, పెగాసస్ వివాదం అంతకంతకూ ముదురుతుండటంతో విపక్షాల దాడిని తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ సీనియర్ నేతలను బీజేపీ బరిలోకి దింపింది.