సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా సతీమణి కరోనాతో మృతి
ABN , First Publish Date - 2021-06-12T14:30:02+05:30 IST
సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా భార్య, ప్రముఖ రేడియాలజిస్ట్ పద్మావతి దువా కరోనాతో శుక్రవారం రాత్రి కన్నుమూశారు....
న్యూఢిల్లీ : సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా భార్య, ప్రముఖ రేడియాలజిస్ట్ పద్మావతి దువా కరోనాతో శుక్రవారం రాత్రి కన్నుమూశారు. చిన్నా దువాగా ప్రసిద్ధి చెందిన పద్మావతికి కరోనా వైరస్ సోకడంతో మే 13వతేదీ నుంచి కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. పద్మావతిని గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా మరణించారు. వినోద్ దువాకు కూడా కరోనా నుంచి కోలుకున్నారు. వినోద్ దువా దంపతులకు మల్లికా దువా, బకుల్ దువాలనే కుమార్తెలున్నారు. పద్మావతి దువా మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.