రామ మందిర్ ట్రస్ట్పై ఆప్ సంచలన ఆరోపణలు
ABN , First Publish Date - 2021-06-14T13:05:20+05:30 IST
అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తున్న...
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తున్న రామజన్మభూమి తీర్థ ట్రస్ట్పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడు, పార్టీ జాతీయ ప్రతినిధి సంజయ్ సింగ్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ట్రస్ట్ బాగోతాలపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. యూపీలోని లక్నోలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సంస్థ సభ్యుడు అనిల్ మిశ్రాలు రూ. 2 కోట్ల విలువైన భూమిని రూ.18 కోట్లకు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఈ ఉదంతంపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసి, ప్రభుత్వం, సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇదేవిధంగా సమాజ్వాదీ మంత్రి, అయోధ్య మాజీ ఎమ్మెల్యే పవన్ పాండే కూడా అయోధ్యలో భూముల కొనుగోలులో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. దీనిపై చంపత్ రాయ్ స్పందిస్తూ ఇలాంటి ఆరోపణలకు తాను భయపడేది లేదన్నారు. దీనిపై దర్యాప్తు చేసుకోవచ్చన్నారు.