హజ్కు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ
ABN , First Publish Date - 2021-11-02T07:59:18+05:30 IST
హజ్యాత్ర-2022కు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. దక్షిణ ముంబైలోని హజ్హౌ్సలో...
![హజ్కు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ముంబై, నవంబరు 1: హజ్యాత్ర-2022కు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. దక్షిణ ముంబైలోని హజ్హౌ్సలో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బా్సనఖ్వీ యాత్రికుల కోసం పలు సౌకర్యాలను ప్రకటించారు. దరఖాస్తుల ప్రక్రియ 100 శాతం ఆన్లైన్లో జరుగుతుందని, స్వీకరణకు చివరి తేది వచ్చే ఏడాది జనవరి 31 అని పేర్కొన్నారు. సౌదీఅరేబియాలోని ధరలతో పోల్చితే 50 శాతం తక్కువకే యాత్రికులు తమకు కావాల్సినవి కొనుగోలు చేయవచ్చని తెలిపారు.