మరోసారి పెరిగిన ఇంధనాల ధరలు

ABN , First Publish Date - 2021-10-29T08:21:49+05:30 IST

ఇంధనాల ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. గురువారం లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై ధర 35 పైసల చొప్పున పెరిగింది.

మరోసారి పెరిగిన ఇంధనాల ధరలు

న్యూఢిల్లీ, అక్టోబరు 28: ఇంధనాల ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. గురువారం లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై ధర 35 పైసల చొప్పున పెరిగింది. తాజా పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.108.29, ముంబైలో రూ.114.14కు చేరింది. ఢిల్లీలో లీటరు డీజిల్‌ ధర రూ.97.02కు చేరగా.. ముంబైలో రూ.105.12కు చేరుకుంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ఽరూ.112.64, డీజిల్‌ రూ.105.84 పలుకుతోంది. 

Updated Date - 2021-10-29T08:21:49+05:30 IST