Covid ప్రబలకుండా చర్యలు చేపట్టండి
ABN , First Publish Date - 2021-10-27T12:44:35+05:30 IST
పండుగ సీజన్ ముగిసిన తర్వాత కరోనా తీవ్రత పెరగకుండా తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రికి ఎంకే స్టాలిన్కు అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ. పన్నీర్సెల్వం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఓపీఎస్ విడుద
- సీఎంకు ఓపీఎస్ లేఖ
పెరంబూర్(Chennai): పండుగ సీజన్ ముగిసిన తర్వాత కరోనా తీవ్రత పెరగకుండా తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రికి ఎంకే స్టాలిన్కు అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ. పన్నీర్సెల్వం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఓపీఎస్ విడుదల చేసిన ప్రకటనలో, రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి రావడంతో లాక్డౌన్కు రాష్ట్రప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో టి.నగర్, పురుషవాక్కం, వాషర్మెన్పేట సహా పలు మార్కెట్ ప్రాంతాల్లో ప్రజల సంచారం అధికంగా ఉందన్నారు. పండుగ సమీపిస్తుండడంతో రద్దీ అధికమయ్యే అవకాశముందని, ఇప్పుడే రద్దీని నియంత్రించకపోతే పండుగ అనంతరం కరోనా ప్రబలే అవకాశముందన్నారు. కొవిడ్ నిబంధనలు తప్పకుండా అమలయ్యేలా సీఎం ప్రత్యేక దృష్టి సారించాలని ఓపీఎస్ విజ్ఞప్తి చేశారు.